Header Banner

విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి హల్‌చల్! 5 లక్షల డిమాండ్‌తో..

  Wed May 07, 2025 20:11        Others

విశాఖపట్నం మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సుధాకర్ అనే వ్యక్తి ఏసీబీ అధికారిగా ప్రవేశించి హల్ చల్ చేశాడు. త్వరలో రైడ్ జరుగుతుందంటూ సిబ్బందిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే అతని తీరుపై అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ అధికారి అని తేలడంతో పీఎం పాలెం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఇలాంటి మోసం చేయటం ఇదే తొలిసారా.. గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.

 

విశాఖపట్నం మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం.. బుధవారం ఉదయం 11 గంటల సమయం.. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సామాన్య ప్రజానీకం ఓ వైపు.. రిజిస్ట్రేషన్ పనుల్లో అధికారులు మరోవైపు తలమునకలై ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లారు. తన పేరు సుధాకర్ అని.. తాను ఏసీబీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. త్వరలోనే మీ రిజిస్ట్రార్ ఆఫీసులో రైడ్ జరగబోతోందంటూ మధురవాడలోని సబ్‌‍రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బందిని బెదిరించాడు. రైడ్ జరగకుండా తాను చూస్తానని.. కావాలంటే తన పైస్థాయి అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌లో అవతలి వ్యక్తితో మాట్లాడించారు. ఇక రిజిస్ట్రార్ ఆఫీసులో రైడ్ జరగకుండా ఉండాలంటే తనకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అయితే మనోడి వాలకంపై మధురవాడ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బందికి అనుమానం కలిగింది. ఏసీబీ అధికారినని చెప్తున్నప్పటికీ మాట తీరు, వేషధారణ సరిపోలడం లేదు. దీనికి తోడు ఐడీ కార్డు కూడా లేకపోవటంతో వారి అనుమానం మరింత బలపడింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే వరకూ అతన్ని మాటల్లో పెట్టారు. అనంతరం పీఎం పాలెం పోలీసులు మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు చేరుకున్నారు. ఏసీబీ అధికారినంటూ చెప్పిన సుధాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే మనోడు ఒరిజినల్ కాదని.. నకిలీ ఏసీబీ అధికారి అని తేలింది. దీంతో పీఎం పాలెం పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని.. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అతన్ని విచారిస్తున్నారు.

 

అయితే సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఏసీబీ అధికారినంటూ ఎంట్రీ ఇవ్వడం.. రైడింగ్ జరగకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మాములుగా ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇక్కడ.. గవర్నమెంట్ ఆఫీసులో జరగటంపై సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది కూడా చర్చించుకుంటున్నారు. మోసగాళ్లు రోజురోజుకూ తెలివి మీరుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఈ విషయం తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే మన నకిలీ ఏసీబీ అధికారి మోసగించేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారా.. గతంలోనూ ఇలాంటి మోసాలకు ఏమైనా పాల్పడ్డాడా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SubRegistrarOffice #VizagNews #APPolice #CrimeAlert #AndhraPradeshNews #FraudAlert #ACBDrama #VizagCrime #FakeACBOfficer